లారీలు ఢీ..3 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌

15 Aug, 2019 18:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని కనకదుర్గ వారధిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో రెండు గంటలుగా ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు కూడా మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు