రాజధాని భూమి పూజకు స్వల్ప ఆటంకాలు

6 Jun, 2015 07:54 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి మరికొద్ది సేపట్లో భూమిపూజ ప్రారంభం కానుండగా తుళ్లూరు మండలంలో ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. మందడం- తాళ్లాయపాలెంలో శనివారం ఉదయం బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం కురుస్తుండటంతో భూమి పూజకు స్వల్ప ఆటంకాలు ఎదురయ్యాయి. గాలుల ధాటికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఆహుతుల కోసం పేర్చి ఉంచిన కుర్చీలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.

శనివారం ఉదయం 8:49 నిమిషాలకు ముహుర్తం ఖరారుకాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితి అధికారులను కలవరపెడుతోంది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సతీసమేతంగా రాజధాని ప్రాంతానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. బంగారు తాపీ, వెండి గమేలాతో భూమి పూజ నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు