భవానీలతో ఇంద్రకీలాద్రి కిటకిట

11 Dec, 2017 10:15 IST|Sakshi

విజయవాడ:  విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీలతో కిటకిటలాడుతోంది. దీక్ష విరమణ చేయటానికి భారీ సంఖ‍్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం 68వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజైన సోమవారం తెల్లవారుజాము నుంచే భవానీల తాకిడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భవానీలతో కృష్ణాతీరం ఎరుపెక్కింది. ఘాట్లలో పుణ్యస్నానాల అనంతరం భవానీలు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అనంతరం దీక్ష విరమణ చేసి హోమగుండాల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీక్ష విరమణ చేసే మహామండపంలో ఎక్కువ మంది సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందిగా మారిందని భవానీలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు