హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బుధవారం ఉదయం 10 గంటల కల్లా సమ్మె విరమణపై నిర్ణయం చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు రెండు రోజులు గడువు కావాలని హైకోర్టును కోరాయి. అయితే సమ్మెతో ఆర్టీసీ ఇప్పటికే చాలా నష్టపోయిందని వ్యాఖ్యానిస్తూ గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. అంతకు ముందు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్టు... సమ్మె విరమణకు ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే.