'సమ్మె విరమిస్తారా? కొనసాగిస్తారా? చెప్పండి'

20 Sep, 2013 13:44 IST|Sakshi
'సమ్మె విరమిస్తారా? కొనసాగిస్తారా? చెప్పండి'

 ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.  ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన  ప్రజాప్రయోజన వాజ్యాన్ని శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఏపీఎన్జీవోలు తమ వాదనలు వినిపించారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

 

సమ్మె చేయడం వల్ల ఎవరికా లాభం కలుగుతోందని హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మె విరమించుకుంటారా లేదా స్పష్టంగా రేపటిలోగా చెప్పాలని ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. సమ్మె పిటిషన్పై రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే.

>
మరిన్ని వార్తలు