జగన్మోహన్రెడ్డిని కలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ప్రజాసంకల్ప యాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ గురువారం విశాఖపట్నంలోని విమానాశ్రయానికి చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సీఐఎస్ఎఫ్ బలగాలు, నిఘా వర్గాలు జగన్ను అడుగడుగునా అనుసరించాయి. ఎయిర్పోర్టులోని వీఐపీ లాంజ్లోకి ప్రవేశించగానే గత నెల 25న జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనను పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు.
జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మల్లాది విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు జగన్ను మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ కలుసుకున్నారు.