హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

21 Mar, 2015 08:27 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది. దాంతో బాలింత బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. తల్లి బిడ్డల మృతదేహాలతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి... మృతుల బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు