చెన్నూరులో ఉద్రిక్త పరిస్థితులు

23 Apr, 2016 12:08 IST|Sakshi

చెన్నూరు: మసీదు నిర్మాణం విషయమై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్ జిల్లా చెన్నూర్ పట్టణంలోని ముస్లింకాలనీ ఇందుకు వేదికయింది. కాలనీలో మసీదు నిర్మాణం కోసం ఒక వర్గం వారు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, మరో వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. శనివారం రెండు వర్గాల మధ్య వాదులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎస్సై హుస్సేన్ పది మంది సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని ప్రశాంత పరచటానికి యత్నించారు. అదే సమయంలో ఓ వర్గం వాళ్లు రాళ్లురువ్వటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.

మరిన్ని వార్తలు