సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లతో పోలిస్తే సర్వీస్ ఓట్లు గణనీయంగా తగ్గాయి. రేపు ఉదయం ఏడులోగా కౌంటింగ్ సెంటర్కు చేరే సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. కాగా రేపే కౌటింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మే 20 నాటికి జిల్లాల వారీగా పోలైన సర్వీసు ఓట్ల వివరాలు..
శ్రీకాకుళం 8121
విజయనగరం 2564
విశాఖపట్నం 3333
తూర్పు గోదావరి 923
కృష్ణా 457
గుంటూరు 3036
ప్రకాశం 3765
నెల్లూరు 362
కడప 1175
కర్నూలు 1935
అనంతపురం 1676
చిత్తూరు 2185