సభ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలొద్దు

25 Mar, 2015 02:06 IST|Sakshi
సభ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలొద్దు

ఏపీ స్పీకర్ కోడెల ఆదేశాలు

 హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల (అసెంబ్లీ ప్రాంగణంలో) ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వొద్దని ఏపీ శాసన సభాపతి (స్పీకర్) డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌తో పాటు వివిధ పార్టీల శాసన సభాపక్ష కార్యాలయాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు