మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో గత అర్థరాత్రి ఓ ఇంట్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాంతో బాధితులు ఆదివారం మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.2 లక్షల నగదు, 10 సవర్ల బంగారంతోపాటు యూఎస్ డాలర్లను దొంగలు అపహరించుకుని పోయారని బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.