అమరావతిలో పేదల హౌసింగ్‌ జోన్‌

11 Mar, 2020 04:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో ఈడబ్లూఎస్, అఫర్డ్‌బుల్‌ హౌసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు సీఆర్‌డీయే మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాల్లో ఈ హౌసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో నివాసయోగ్యంగా పేర్కొన్న ప్రాంతంలోనే ఈ కొత్త హౌసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో సీఆర్‌డీయే కమిషనర్‌ను ఉద్దేశించి లిఖిత పూర్వకంగా తెలపాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వాటిని పరిశీలించేది లేదని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు