ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదు
పదో తరగతి పిల్లల స్కూలు బ్యాగులు బరువు ఐదు కేజీలు మించరాదు
రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు
విద్యాసంవత్సరం మధ్యలో ఆదేశాలతో గందరగోళంలో విద్యాశాఖ
వెన్నెముక విరిగేలా పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న బడి పిల్లలకు శుభవార్త! ఇక నుంచి అన్ని పుస్తకాలు, అంత బరువు మోయాల్సిన పనిలేదని, బరువును వెంటనే తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. స్కూలు పిల్లల తరగతుల వారీగా ఎంతెంత బరువుండాలో మార్గదర్శకాలు రూపొందించింది.
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: బడి పిల్లలకు పుస్తకాల బ్యాగుల బరువు భారం తగ్గనుంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్లో నిర్ధారించిన బరువు కన్నా ఎక్కువ బరువు గల బ్యాగులను అనుమతించరాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది.
నిబంధలు బేఖాతరు
నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యా శాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
2006 చట్టం ఏం చెబుతోంది?
బరువు సంచితో నష్టాలు
ఆదేశాలివీ..
ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి. విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు. ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి.
కేంద్రం ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి..
తరగతి బరువు(కిలోలు)
1-2 1.5
3-5 2.3
6 -7 4
8-9 4.5
10 5