రిజిస్ట్రేషన్‌ లేకపోతే వెహి‘కిల్‌’!

15 Mar, 2020 04:46 IST|Sakshi

స్క్రాప్‌గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయం

ఏప్రిల్‌ నుంచి వాహన తనిఖీలు ముమ్మరం

రిజిస్ట్రేషన్‌ లేకుండా బీఎస్‌–4 వాహనం పట్టుబడితే భారీ జరిమానా

సాక్షి, అమరావతి: ఈ నెలాఖరులోగా బీఎస్‌–4 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే యజమానులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను స్క్రాప్‌గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆ శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్‌ కోసం ఎదురు చూస్తూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్‌ చేయించని బీఎస్‌–4 వాహనం పట్టుబడితే భారీగా జరిమానా విధించాలని, ఆ వాహనాన్ని స్క్రాప్‌గా పరిగణించాలన్నారు. 

- ఈ నెల 25లోగా బీఎస్‌–4 వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఇప్పటికే రవాణా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
- ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేస్తారు. 
- యజమానులు తమ పేరిట ఉన్న  రెండో వాహనానికి అదనపు ట్యాక్స్‌ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రవాణా అధికారులు గుర్తించారు. 
- అలాంటి యజమానులకు వాహన డీలర్లు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
- దీంతో వాహన డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కమిషనర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. 
రెండో వాహనం ఉన్న యజమానులు ఈ నెల 25లోగా అదనపు ట్యాక్స్‌ చెల్లించాలన్నారు. 

మరిన్ని వార్తలు