ఇద్దరి ప్రాణాలు బలిగొన్న గుప్తనిధుల వేట

26 Dec, 2013 14:35 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లాలో గుప్తనిధుల వేట  ఇద్దరి ప్రాణాలను బలిగొంది. డోన్ మండలం బొంతిరాళ్ల గ్రామ శివార్లలో గుప్తనిధులు కోసం జేసీబీతో త్రవ్యకాలు చేపట్టారు. ఇది గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్థానికుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నంలో ఇద్దరు ముఠా సభ్యులు జేసీబీ తగిలి ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముఠా సభ్యులు హైదరబాద్‌కు చెందిన వారిగా పోలీసులు తెలియజేశారు. జేసీబీతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకుని  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు