'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'

17 Mar, 2015 16:42 IST|Sakshi
'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'

అనంతపురం:  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శైలజానాథ్ అక్రమ ఆస్తులు కూడబెట్టారని మంజునాథ నాయుడు అనే వ్యక్తి మంగళవారం  ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు. శైలజానాథ్ మంత్రిగా ఉండగా అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సహకారంతో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. తమ భూమి హైకోర్టు విచారణలో ఉండగా శైలజా నాథ్  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా శైలజానాథ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.

మరిన్ని వార్తలు