ఢిల్లీ: తన రాజీనామాను ఆమోదించమని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కోరినట్లు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేయకపోతే తమ ప్రజలు ఊరుకోవడంలేదని చెప్పినట్లు తెలిపారు. సమైక్యరాష్ట్రం కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు. తాను నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇక ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్ష్యంలో ఎస్పివై రెడ్డి ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.