తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా

1 Nov, 2014 16:09 IST|Sakshi
తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా

నంద్యాల: పోలీసులపై తెలుగుదేశ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు మాత్రం స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని కొత్త వాదన వినిపిస్తున్నారని భూమా అన్నారు.

తనను, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా.. నేను బెదరను అని నాగిరెడ్డి అన్నారు. ప్రజలు, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా..ధైర్యంగా ఎదుర్కొంటానని భూమా నాగిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు