'గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నా'

9 Aug, 2015 15:02 IST|Sakshi

విశాఖ: తాను గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నాని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. పాడేరు గురుకులం కాలేజీలో ఆదివారం ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆమె.. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు, విద్యార్థులదేనన్నారు.

 

గిరిజన మహిళగా పుట్టినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఆదివాసి దినోత్సవాన్ని ప్రతీ కార్యాలయల్లో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు