అర్ధరాత్రి పీడీయస్‌ బియ్యం అక్రమ రవాణా

14 Aug, 2019 11:20 IST|Sakshi

పశ్చిమగోదావరిలో కోటి రూపాయలు విలువైన రేషన్‌ బియ్యం స్వాధీనం

సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్‌ ఫ్యాక్టరీకి రేషన్‌ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు