రమాదేవి కథ సుఖాంతం....

8 Nov, 2013 08:59 IST|Sakshi
రమాదేవి కథ సుఖాంతం....

హైదరాబాద్ : వారసుడు లేడనే నెపంతో  అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. దిల్సుఖ్నగర్ వికాస్ నగర్లో అత్తింటి ముందు ఆమె ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళ సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి.

మహిళ సంఘాలు బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా... పోలీసులు రమాదేవి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మాలదేవిలను రప్పించారు. మహిళ సీఐ మధులత ఇరువురి అంగీకారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మగ సంతానం లేదనే నెపంతో వేధిస్తున్నట్లు రమాదేవి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపటం విశేషం.

మరిన్ని వార్తలు