ఆన్‌లైన్‌లో..హ్యాపీ న్యూ ఇయర్

27 Dec, 2013 04:18 IST|Sakshi

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలంటే ఒకప్పుడు.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డులు కొనుగోలు చేసి పోస్ట్‌లో పంపేవారం. దగ్గరి ప్రాంతాల్లో ఉన్న వారికి స్వయంగా వెళ్లి గ్రీటింగ్ కార్డు అందజేసి శుభాకాంక్షలు చెప్పేవారం. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.
 
 ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని జిల్లావాసులు అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది క్షణాల్లో విషెష్ వారి దరి చేరుతున్నారుు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం దాటి ఇతర దేశాలకూ తమ సందేశాలను పంపిస్తున్నారు. లాప్‌టాప్ నుంచి కంప్యూటర్.. కంప్యూటర్ నుంచి అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆన్‌డ్రారుుడ్ ఫోన్ల వరకూ అందుబాటులోకి వచ్చారుు. ఇంకేముంది యువత మాత్రమే కాదు.. వయో పరిమితి లేకుండా ఎవరుపడితే వారు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు.
 - న్యూస్‌లైన్, భువనగిరి
 
 ఎస్‌ఎంఎస్ ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్స్..
 బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముదుసలి వరకు నేడు సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అరుుతే.. నెట్‌వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్‌పోన్ల విని యోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెక న్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రారుుతీలు ఇస్తున్నారుు. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్‌ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అరుు్యందంటే నమ్మాల్సిందే.
 
 ఇంటర్‌నెట్‌లో శుభాకాంక్షలు..
 పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు కదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది. విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్‌నెట్లో కదలాడుతూనే ఉన్నారుు. సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న పలువురు విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు.
 
 అనేక వెబ్‌సైట్లు..
 ఇంటర్‌నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్‌సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్‌ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్‌ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్‌ఎంఎస్, ఆల్‌టూ, ఎస్‌ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్‌బుక్, ఆర్‌కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాల వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ ఉన్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు.
 
 అరచేతిలో ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్..
 సెల్‌ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లే కాదు.. ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్‌తో కూడా వివిధ రకాల్లో శుభాకాంక్షలు పంపుకునేలా అవకాశాలు వచ్చాయి. మెస్సేజ్‌లే కాదు వాట్సప్, వీచాట్, వైపర్‌లాంటి అ ప్లికేషన్లు అందుబాటులో ఉన్నారుు. నేడు యువతీయువకులు విద్యార్థులు వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితో అద్భుత రకాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు అలాగే కొం గొత్త ఆలోచనలతో అనేక అప్లికేషన్ల ద్వారా.. మనస్సును దోచే చిత్రాలతో విషెష్ తెలుపుకోవచ్చు.
 
 తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా..
 నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్‌చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్‌కార్డు లు విక్రరుుంచే వారు. రూపారుు నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూరుు. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు.  
 
 200 గ్రీటింగ్‌కార్డులు కూడా అమ్మలేదు
 ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 200 గ్రీటిం గ్‌కార్డులు కూడా అమ్మలేదు. నాలుగైదేళ్ల క్రితం కొత్త సంవత్సరం వచ్చిం దంటే చాలు గ్రీటిం గ్ కార్డులకోసం చాలామంది వచ్చేవా రు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.                           
 -భార్గవి, భువనగిరి
 

మరిన్ని వార్తలు