రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్

1 Aug, 2014 09:40 IST|Sakshi
రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో జయంతి బంగారు నగల దుకాణంపై గత అర్థరాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడిలో ఆదాయపు శాఖ అధికారులు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఆభరణాలను సీజ్ చేశారు.

సీజ్ చేసిన బంగారు ఆభరణాల విలువ దాదాపు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని ఆధికారులు వివరించారు. ఆ నగలను సరైన పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. దుకాణం షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత అర్థరాత్రి నుంచి దాడులు ఈ రోజు తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు నిర్వహించారు.

మరిన్ని వార్తలు