కల్కి ఆశ్రమంలో మళ్లీ ఐటీ కలకలం

20 Nov, 2019 18:44 IST|Sakshi

సాక్షి, తిరుపతి : కల్కి ఆశ్రమంలో ఐటీ దాడులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాలలో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. క్యాంపస్‌-3లోని ఎమ్‌ బ్లాక్‌లో గల రహస్య లాకర్లపై ఆరా తీశారు. ఏకం మహాల్‌, క్యాంపస్‌ 1,2,3లలో తమిళనాడు నుంచి వచ్చిన నాలుగు ఐటీ బృందాలు అనువనువు గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న లాకర్లు, గదులను గాలిస్తున్నారు. కల్కి ఆశ్రమ నిర్వాహకులను, సిబ్బందిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు