'దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్'

18 Nov, 2014 19:40 IST|Sakshi
దొనకొండలో వాడుకలో లేని బ్రిటీషు కాలం నాటి ఎయిర్ పోర్ట్

హైదరాబాద్: ప్రకాశం జిల్లా దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. 45 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు.

సోలార్ ప్లాంట్,  స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బీవోటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు