గాంధీలో అప్పుడే జన్మించిన శిశువు మాయం

18 Aug, 2013 13:37 IST|Sakshi

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం జన్మించిన శిశువు క్షణాల్లో మాయమైంది. దీంతో ఆ శిశువు తల్లితండ్రులు మనోహార్, సులోచనలు వారి బంధువులు ఆసుపత్రి అంతా గాలించారు. అయిన శిశువు జాడ తెలియలేదు. దాంతో ఆ విషయాన్ని వారు ఆసుపత్రిలోని వైద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సలహా మేరకు ఆ శిశువు తల్లితండ్రులు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే తమకు మరియమ్మ అనే మహిళపై అనుమానం ఉందని ఆ శిశువు తల్లితండ్రులు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు