వంశధారకు తగ్గిన వరద

18 Sep, 2015 19:12 IST|Sakshi

హీరాం(శ్రీకాకుళం): ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టటంతో వంశధారకు వరద తగ్గిందని గొట్టా బ్యారేజీ డీఈ ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి 18,514 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీలో పూర్తి సామర్ధ్యం 38.10 మీటర్లకు మించి ఉన్న నీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు