చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం

24 Mar, 2019 11:32 IST|Sakshi
కరేడు గ్రామంలో చొక్క లేకుండా గుండుతో ప్రచారం చేస్తున్న శ్రీనివాసులు

జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడి నిర్ణయం

జిల్లా అంతటా ప్రచారం

బీసీలను మోసం చేసిన బాబు

సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలకు నిరసనగా కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గుండు గీయించుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు. బీసీలపై జగన్‌కున్న ప్రేమ, బీసీ డిక్లరేషన్‌లో ఆయన ప్రకటించిన నిర్ణయాలు నచ్చి జగన్‌కు అండగా నిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు జిల్లా అంతటా వినూత్నంగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. బీసీలను చంద్రబాబు వంచించారని, జిల్లాలో ఒక్క ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన దగ్గర నుంచి జగన్‌ సీఎం అయ్యేంత వరకు జిల్లా అంతటా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని గ్రామాలు తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఇంటికి వెళ్లి జగన్‌ బీసీ కోసం చేస్తున్న కార్యక్రమాలు, అన్ని పదవుల్లో రిజర్వేషన్‌ కల్పించడం, బీసీ నిధులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు