ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో విజిలెన్స్‌ తనిఖీలు

5 Oct, 2019 15:33 IST|Sakshi

సాక్షి, కర్నూలు : రాయలసీమ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పరిధిలోని ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్‌ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలోని డిస్పెన్సరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం సాయంత్రానికి పూర్తి నివేదికను ఇవ్వననున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు