ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

12 Mar, 2016 12:46 IST|Sakshi
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని గాయత్రి కాలేజీకి చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి ముప్పల సాయిరాజ్(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కాలేజీ హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు