హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం

15 Mar, 2015 08:38 IST|Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  తోటి విద్యార్థులు ఆ విషయాన్ని గమనించి హాస్టల్ అధికారులకు తెలిపారు. దాంతో వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్ పరీక్షల్లో డిబార్ కావడంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని హాస్టల్ అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు