సమ్మెలో పాల్గొన్న ఇంటర్ సిబ్బందికి వేతనం

26 Nov, 2013 01:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో(సెప్టెంబర్ 6-అక్టోబర్ 10) పాల్గొన్న ఇంటర్ విద్య అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి వేతనం చెల్లించేందుకు వీలుగా మాధ్యమిక విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరు సమ్మెకాలంలో కోల్పోయిన 25 పనిదినాలను అక్టోబర్ 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు 24 సెలవులు, ఒకరోజు అదనపు పనిగంటలు కలిపి మొత్తంగా 25 పనిదినాలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు