వైఎస్సార్ జిల్లా : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబుతో పాటు అతని నలుగురు అనుచరులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువ గల 37 ఎర్ర చందనం దుంగలు,3 కార్లు, ఒక టాటా సుమో, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు.