నేడే ఇంటర్‌ ఫలితాలు

13 Apr, 2017 07:23 IST|Sakshi
నేడే ఇంటర్‌ ఫలితాలు

ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలి తాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్‌ కోర్సులకు సంబంధిం చిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉద యలక్ష్మి పేర్కొన్నారు.

 విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు