అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్: వాహనాలు స్వాధీనం

10 Jun, 2016 13:14 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీన్లమలలో 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోటి విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వాహనాలను సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు