పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

25 Jun, 2015 17:23 IST|Sakshi

చిత్తూరు (పలమనేరు) :  పలమనేరులో గురువారం అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టయ్యింది.  చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విరూపాక్షిపురానికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి కిడ్నాప్ కేసును చేధించే క్రమంలో పోలీసులు పలమనేరు- చిత్తూరు రహదారి మీద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు సుమో వాహనాల్లో అనుమానాస్పదంగా ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. వీరంతా చిత్తూరు జిల్లాలో పలువురిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు