త్వరితగతిన విచారణ పూర్తిచేయాలి

8 Aug, 2018 06:45 IST|Sakshi
తణుకులో చికిత్స పొందుతున్న శివవర్మను పరామర్శిస్తున్న ఐజీ వెంకటేశ్వరరావు

దోషులపై కఠిన చర్యలకు సిద్ధం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఐజీ వెంకటేశ్వరరావు

తణుకు:  ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఐజీ కె.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. సత్యవాడ గ్రామంలో మద్యం తాగిన యువకుల్లో మడిచర్ల శివవర్మ ప్రాణాలతో బయటపడి తణుకులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మంగళవారం ఆయన పరామర్శించి జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సత్యవాడ గ్రామంలో యువకులు మందుపార్టీ చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించి పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న మద్యం, బీరు బాటిళ్లను ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపించినట్లు చెప్పారు. త్వరితగతిన పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గానీ యువకుల మృతికి కారణాలు వెల్లడికావన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివవర్మను పరామర్శించిన ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎన్ఫోర్స్‌మెంట్‌ సీఐ సీహెచ్‌ అజయ్‌కుమార్‌సింగ్, తణుకు సీఐ కె.ఎ.స్వామి, ఎక్సెజ్‌ సీఐ యు.సుబ్బారావు, ఉండ్రాజవరం ఎస్సె కె.గంగాధరరావు, ఇతర ఎక్సెజ్, పోలీసు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు