రెవెన్యూ భూములపై విచారణ: డిప్యూటీ సీఎం కేఈ

12 Jan, 2015 16:06 IST|Sakshi

హైదరాబాద్: రెవెన్యూ భూముల వ్యవహారాల్లో వీఆర్వోలపై విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం
కే.ఈ. కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై క్రిమినల్ చర్యలు
తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన జీవోపై ఈ నెల 19న కేబినట్ సబ్ కమిటీతో చర్చిస్తామన్నారు.
ఇక మీదట ఏపీఐఐసీ ద్వారా మాత్రమే భూములు కేటాయించడంపై సమీక్షించి నిర్ణయిస్తామన్నారు.

మరిన్ని వార్తలు