ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

30 Dec, 2019 11:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్‌ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్‌ అయ్యారు. 

మరిన్ని వార్తలు