18న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం

9 Dec, 2014 02:03 IST|Sakshi

సూళ్లూరుపేట: మానవసహిత అంతరిక్ష యాత్రకు కసరత్తులో భాగంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ ప్రయోగకేంద్రం నుంచి చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. కాగా ఇస్రో ఆదివారం ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించిన జీశాట్-16 సమాచార ఉపగ్రహం సోమవారం 16,005 కి.మీ. పెరిజీ(భూమికి దగ్గరగా), 35,769 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా)గల కక్ష్యకు చేరుకుంది.

మరిన్ని వార్తలు