హిజ్రాలకు పింఛన్‌ మంజూరు పత్రాల అందజేత

11 May, 2018 12:24 IST|Sakshi
పింఛను మంజూరు పత్రాలు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తమ్మినేని గీత 

ఆమదాలవలస శ్రీకాకుళం : ఆమదాలవలస పురపాలక సంఘం 8వ వార్డులో నివసిస్తున్న ఎనిమిది మంది హిజ్రాలకు నెలకు రూ.1500 చొప్పున పింఛన్‌ను అందజేసే ఉత్తర్వులను గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత అందించారు.  జిల్లాలో తొలిసారిగా ఆమదాలవలస మున్సిపాలిటీలోనే హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ తెలిపారు.

మరో 20 మందికి వైద్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావాల్సి ఉందని,  వారికి కూడా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షడు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సిబ్బంది ఎ.వి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు