ఈ సర్కారుపై బండేస్తాం..

4 Jan, 2014 02:49 IST|Sakshi

 ‘ఈ ప్రభుత్వాలకు పేదళ్ల బాగోగులు పట్టవు. వాళ్లు ఎట్టా సస్తేనేం.. మనం బాగుంటేసాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు.. మీ మొహాలకు గ్యాసు పొయ్యి కావాల్సి వచ్చిందా అనుకునే కాబోలు ఇలా ధర పెంచేత్తున్నారు.
 
 ఈసారి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలపై బండ పడేయండ’ని మహిళలు నిప్పులు చెరిగారు. వంట గ్యాస్ సిలిండ్ ధర భారీగా పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురంలో కట్టెల పొయ్యి వెలిగించి ‘స్త్రీ విముక్తి సంఘటన’ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.                    
 - న్యూస్‌లైన్, అనంతపురం
 

మరిన్ని వార్తలు