చదువుకోరా అంటే.. ఆత్మహత్య చేసుకున్నాడు..

15 Dec, 2015 14:56 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రానికి చెందిన ఓ ఐటీఐ విద్యార్థి తల్లిదండ్రులు మందలించారని... మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాల మోహన్‌రావు శ్రీకాకుళంలో ఐటీఐ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకపోవడంతో చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన మోహన్‌రావు మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో మరణించాడు.



 

మరిన్ని వార్తలు