అన్న సీఎం కావాలని అన్నవరంలో అర్చన చేశా

20 Sep, 2018 06:47 IST|Sakshi

మాది కడప. వైఎస్సార్‌ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. దివంగత వైఎస్సార్‌ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న రాష్ట్ర భవిష్యత్‌ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. జగనన్న సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. జగనన్న సీం కావాలని, ఆరోగ్యం బాగుండాలని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో అర్చనలు చేసి ప్రసాదం తీసుకువచ్చాను. బుధవారం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన వెంటనే అన్నకు ప్రసాదం తినిపించాను. 
–ఎం.సునీతారెడ్డి, కడప

మరిన్ని వార్తలు