అలా చేసి ఉంటే జగన్‌ సీఎం అయ్యేవాడు

17 Dec, 2017 20:19 IST|Sakshi

- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 

గుడిపాల: చంద్రబాబులాగా నక్కజిత్తుల రాజకీయాలు చేసి ఉన్నా, కాంగ్రెస్ అధిష్టానంతో లాలూచీ పడినా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ముఖ్యమంత్రి పదవిని పొంది ఉండేవాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆర్‌.కె.రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు వ్యాఖ్యానించారు. చిత్తూరుజిల్లాలోని మండల కేంద్రమైన గుడిపాలలో పార్టీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వారు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి కనపడిన వారందరి కాళ్ళు పట్టుకున్నాడని, చివరికి పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ఓటుకు నోటు కేసుతో అక్కడినుంచి అమరావతికి మకాం మార్చి 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసబుచ్చుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కుప్పం ఇన్‌చార్జి చంద్రమౌళి, చిత్తూరు పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ నేతలు ఎం.ఎస్‌.బాబు, ఆకుల గజేంద్ర, గాయత్రి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాజరత్నంరెడ్డి, వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు