జనతా పత్రిక అధినేత మొవ్వా మృతి

6 Nov, 2017 19:35 IST|Sakshi

విజయవాడ: జనతా దినపత్రిక అధినేత మొవ్వా నాగేశ్వరరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందారు.  కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మొవ్వా నాగేశ్వరరావు సోమవారం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1976 లో జనతా పత్రికను మొవ్వా నాగేశ్వరరావు ప్రారంభించారు. మొవ్వా నాగేశ్వరరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు