విజయవాడ: జనతా దినపత్రిక అధినేత మొవ్వా నాగేశ్వరరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మొవ్వా నాగేశ్వరరావు సోమవారం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1976 లో జనతా పత్రికను మొవ్వా నాగేశ్వరరావు ప్రారంభించారు. మొవ్వా నాగేశ్వరరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.