'జన్మభూమి'లో రసాభాస

3 Jun, 2015 18:25 IST|Sakshi

తూర్పుగోదావరి(తొండంగి): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్‌లు తీసేశారంటూ గ్రామంలో వృద్ధులు, వితంతువులు ప్రభుత్వాధికారులను నిలదీశారు. మాకు పింఛన్ మంజూరు చేస్తారా ? లేదా అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు