సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2015-16 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఆర్.రామారావు గురువారం తెలిపారు.
అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2015 ఫిబ్రవరి 7న నిర్వహించనున్న ఈ ఎంపిక పరీక్షకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. నవోదయ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చు.