దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి

1 May, 2020 17:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడుతున్న నర్సులు కోసం 10 వేల సర్జికల్‌, 2500 ఎన్‌-95 మాస్కుల్ని టీఎన్‌ఏఐ ఏపీ ప్రతినిధులు అందించారు. శుక్రవారం ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) ఏపీ బ్రాంచ్‌ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డిని కలిసి మాస్క్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. టీఎన్‌ఎఐ ప్రతినిధుల సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో అందరి భాగస్వామ్యం కావాలని.. దాతృత్వాన్ని పెంపొందించుకోవాలని జవహర్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు