అదుపుతప్పిన జీపు; నలుగురికి గాయాలు

27 Nov, 2019 13:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం వద్ద రిలయన్స్‌ ఫ్రెష్‌ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌లను ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో జీపు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. గాయపడిన వారిని అగనంపూడి ఆసుపత్రికి తరలించారు.


 

మరిన్ని వార్తలు